jamuna: సావిత్రికి ఎంతగా చెప్పినా ఆమె వినిపించుకోలేదు: సీనియర్ నటి జమున

  • సావిత్రి ఆస్తులన్నీ పోయాయి 
  • కొడైకెనాల్లో ఇల్లు అమ్మేయమని చెప్పాను 
  • పిల్లల కోసం ఆరోగ్యం కాపాడుకోమని అన్నాను

సావిత్రి .. జమున కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు. ఇద్దరి మధ్య అక్కా చెల్లెళ్ల అనుబంధం వుండేది. సావిత్రి గురించిన ప్రస్తావన ఎవరు తీసుకొచ్చినా జమున గొంతు మూగబోతుంది. అలాంటి జమున తాజా ఇంటర్వ్యూలో సావిత్రిని గుర్తుచేసుకున్నారు.

"సావిత్రి సంపాదించుకున్న ఆస్తులన్నీ చాలావరకూ పోయాయి. కొడైకెనాల్ లో సావిత్రికి ఒక ఇల్లు వుండేది. ఆమె ఆ ఇంట్లో ఉండగా, నేను షూటింగు కోసమని చెప్పి కొడైకెనాల్ వెళ్లాను.  అప్పుడు సావిత్రిని కలిశాను. 'జెమినీ గణేశన్ అలా తిరుగుతున్నాడు .. ఇలా తిరుగుతున్నాడని బాధపడకు. ఆయన గురించి అన్నీ తెలిసే చేసుకున్న తరువాత ఇక బాధపడటం అనవసరం. ఈ ఇల్లు అమ్మేసి .. నీ పేరు మీద ఫిక్స్డ్ చేసుకో. పిల్లల కోసం నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీపై వుంది. ఇక నువ్వు వాళ్ల కోసమే బతకాలి అని చెప్పాను. అయినా సావిత్రి వినిపించుకోలేదు" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News