Andhra Pradesh: ముస్లిం సోదరులకు భగవంతుడు శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలి!: నారా లోకేశ్

  • నేటితో రంజాన్ ఉపవాసాలు ప్రారంభం
  • ముస్లిం సోదరులకు లోకేశ్ శుభాకాంక్షలు
  • వేసవిని తట్టుకునే శక్తి, సంకల్పం ఇవ్వాలని ప్రార్థన

ముస్లింలకు పవిత్రమైన రంజాన్ ఉపవాసాలు నేటితో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ముస్లిం సోదరులకు రంజాన్ మాస ప్రారంభ దిన శుభాకాంక్షలు తెలిపారు. మండుతున్న వేసవిలో ఉపవాసాలు ఉంటున్న ముస్లిం సోదరులకు ఆ భగవంతుడు శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

ఈరోజు ట్విట్టర్ లో నారా లోకేశ్ స్పందిస్తూ..‘అత్యంత నిష్టతో పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభించిన ముస్లిం సోదరులకు రంజాన్ మాస ప్రారంభదిన శుభాకాంక్షలు. మండు వేసవిలో కఠిన దీక్షలు ప్రారంభించిన ముస్లింలకు ఆ భగవంతుడు శక్తిని, ఆరోగ్యాన్ని, సంకల్ప బలాన్ని  ప్రసాదించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.

More Telugu News