jamuna: సావిత్రి గురించి నన్ను ఒక్కమాట కూడా అడక్కపోవడం బాధ కలిగించింది: సీనియర్ హీరోయిన్ జమున

  • సావిత్రితో ఎంతో అనుబంధం వుంది 
  • తన కష్టాలు .. బాధలు నాతో చెప్పుకునేది
  •  సావిత్రి గురించి పూర్తిగా తెలిసింది నాకే  

తెలుగు తెరపై అలనాటి కథానాయికలుగా సావిత్రి .. జమున తమ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ సరసన అనేక చిత్రాలలో కనువిందు చేస్తూ భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. సావిత్రితో కలిసి జమున ఎన్నో సినిమాల్లో నటించారు. తాజా ఇంటర్వ్యూలో జమున మాట్లాడుతూ, సావిత్రి బయోపిక్ ను గురించి ప్రస్తావించారు.

"సావిత్రి బయోపిక్ తీసేటప్పుడు ఆమెను గురించి నన్ను ఎవరూ ఏమీ అడగలేదు. ఈ విషయం నాకు చాలా బాధను కలిగించింది. సావిత్రితో కలిసి నటించిన వాళ్లెవరూ ఇప్పుడు లేరు. నాకు .. సావిత్రికి ఎంతో అనుబంధం వుంది. ఆమెతో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించాను. ఆమె గురించి అందరికంటే ఎక్కువగా తెలిసింది నాకే. తన జీవితంలోని కష్టాలను .. బాధలను ఆమె నాతోనే పంచుకునేది. అలాంటిది సావిత్రి గురించి నా అభిప్రాయాలను కూడా తీసుకుని వుంటే, సినిమాకి మరింత ఉపయోగకరంగా ఉండేదని నేను అనుకుంటున్నాను" అని ఆమె చెప్పుకొచ్చారు. 

More Telugu News