basara: బాసర అమ్మవారి కిరీటంలో రత్నం మాయం

  • బాసరలో మరో అపచారం
  • కనిపించకుండా పోయిన రత్నం
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో మరోసారి కలకలం రేగింది. ఈసారి ఏకంగా అమ్మవారి కిరీటంలోని రత్నం మాయమైంది. గత కొన్ని రోజులుగా ఈ రత్నం కనిపించడం లేదు. అయినప్పటికీ విషయం బయటకు రాకుండా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. చివరకు విషయం బయటకు పొక్కడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2006లో అమ్మవారికి కానుకగా సమర్పించిన ఓ కిరీటానికి ఓ భక్తుడు వజ్రాలు, రత్నాలను పొదిగించారు. వీటిలో ఒక రత్నం ఇప్పుడు మాయమైంది. ఈ విషయంపై అర్చకులు స్పందిస్తూ, పూజలు చేసే సమయంలో ఒక్కోసారి వజ్రం జారిపోతుంటుందని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు.

  • Loading...

More Telugu News