India: నాపై 9 సార్లు దాడి చేశారు.. ఇండియా చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు!: సీఎం కేజ్రీవాల్

  • నిన్న మోతీనగర్ లో కేజ్రీవాల్ పై దాడి
  • చెంపపై కొట్టిన యువకుడు కిశోర్
  • బీజేపీనే చేయించిందన్న మనీశ్ సిసోడియా

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై నిన్న కిశోర్ అనే యువకుడు దాడిచేసిన సంగతి తెలిసిందే. మోతీనగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ చెంపపై అతను బలంగాకొట్టాడు. ఈ విషయమై కేజ్రీవాల్ ఈరోజు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత ఐదేళ్లలో తనపై 9 సార్లు దాడులు జరిగాయని కేజ్రీవాల్ తెలిపారు.

ఇండియా చరిత్రలో ఓ ముఖ్యమంత్రిపై ఇన్నిసార్లు దాడులు జరగలేదని వ్యాఖ్యానించారు. భారత్ మొత్తంమీద కేవలం ఢిల్లీ ముఖ్యమంత్రి రక్షణ మాత్రమే బీజేపీ నేతల చేతుల్లో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీనే ఈ దాడి చేయించిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. కేజ్రీవాల్ ను చంపేయాలనుకుంటున్నారా? అని మండిపడ్డారు.

More Telugu News