అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త.. ఆపై ఆత్మహత్య.. విజయవాడలో కలకలం
- పెళ్లైన తొలి రోజు నుంచే భార్యపై అనుమానం
- ఇద్దరు పిల్లలు పెళ్లిళ్లు చేసినా భార్యపై అనుమానం
- నిద్రపోతున్న భార్యపై దాడి చేసి హతమార్చిన వైనం
తమకు పుట్టిన ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేసినా ఆ అనుమానం వీడకపోగా, మరింత పెద్దదైంది. మూడు రోజుల క్రితం కృష్ణకుమారి తన అక్క ఇంటికి వెళ్లి శుక్రవారం రాత్రి ఇంటికొచ్చింది. భోజనం చేసి నిద్రపోతున్న ఆమెను చూసిన భర్త నరసింహారావు గొడ్డలితో ఆమెపై దాడిచేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. అయితే, తెల్లారితే విషయం బయటపడి అందరికీ తెలిసిపోతుందన్న భయంతో ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అదే కాలనీలో ఉంటున్న వారి కుమారుడు ఉదయం ఇంటికి రావడంతో విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.