Andhra Pradesh: గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలి.. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలి!: వైసీపీ నేత విజయసాయిరెడ్డి

  • ఫణి సహాయ చర్యలు, కోడ్ కొనసాగుతున్నాయి
  • ఓ నెల రోజులు పరీక్షను వాయిదా వేయలేరా?
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫణి సైక్లోన్ సహాయక, పునరావాస చర్యలు సాగుతుండగానే ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షను నిర్వహించడాన్ని వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి తప్పుపట్టారు. ఓ వైపు సహాయక చర్యలు, మరోవైపు ఎన్నికల కోడ్ అమలు అవుతున్న నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.

ఏపీపీఎస్సీ ఈ గ్రూప్-2 పరీక్షలను మరో నెల రోజుల పాటు వాయిదా వేయలేదా? అని అడిగారు. చూస్తుంటే ఎపీపీఎస్సీ చైర్మన్ దేనికో హడావుడి పడుతున్నట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జోక్యం చేసుకుని గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

More Telugu News