secundarabad: పెళ్లి సందడిలో అదుపుతప్పిన టాటా ఏస్‌ వాహనం.. ఒకరి మృతి

  • మరో ఇద్దరికి గాయాలు
  • ఆగివున్న వాహనాన్ని నడిపేందుకు ప్రయత్నించిన బాలుడు
  • బ్యాండ్ బృందంపైకి దూసుకుపోయిన వాహనం

డ్రైవర్‌ నిర్లక్ష్యం, ఓ బాలుడి ఆకతాయి తనం మరో బాలుడి ప్రాణాలను బలిగొన్నాయి. ఆగివున్న టాటా ఏస్‌ వాహనాన్ని నడిపే ప్రయత్నంలో అది అదుపుతప్పి దూసుకు పోవడంతో ఒకరు చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు...సికింద్రాబాద్‌ వారాసిగూడలో గురువారం అర్ధరాత్రి ఓ పెళ్లి బృందం ఊరేగింపు కార్యక్రమం జరుగుతోంది.

అదే సమయంలో ఓ టాటా ఏస్‌ వాహనం వచ్చి అక్కడ ఆగింది. డ్రైవర్‌ ఇంజిన్‌ ఆన్‌లోనే ఉంచి ఏదో కొనేందుకు సమీపంలోని పాన్‌షాప్‌లోకి వెళ్లాడు. దీన్ని గమనించిన ఓ బాలుడు సరదాతో వాహనంలోకి ఎక్కి హ్యాండ్ బ్రేక్ తీసి, ఏక్సిలేటర్‌పై కాలు వేయడంతో బండి ముందుకు దూసుకుపోయింది. ఆ సమయానికి వాహనం ముందు బ్యాండ్‌ బృందం ఉండడంతో వారిని ఢీకొట్టుకుంటూ వాహనం వెళ్లింది.

ఈ హఠాత్పరిణామంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వాహనం ముగ్గురి పైనుంచి దూసుకు వెళ్లడంతో ఒకరు అక్కడికక్కడే చనిపోగా ఇద్దరు గాయపడ్డారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News