Andhra Pradesh: ఏపీ, తెలంగాణపై హ్యాకర్ల పంజా.. డిస్కం కంప్యూటర్ల లాక్.. రూ.35 కోట్లు ఇవ్వాలని డిమాండ్!

  • ఈరోజు ఉదయం ఘటన
  • ముందుగానే సమాచారాన్ని బ్యాకప్ చేసిన డిస్కంలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిస్కంలపై హ్యాకర్లు పంజా విసిరారు. టీఎస్ ఎస్పీడీసీఎల్, టీఎస్ ఎన్పీడీసీఎల్, ఎపీ ఎస్పీడీసీఎల్ వెబ్ సైట్లను ర్యాన్సమ్ వేర్ వైరస్ తో దాడిచేశారు. ఈ కంప్యూటర్లలోని సమాచారం మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. దాదాపు రూ.35 కోట్లు చెల్లిస్తే కంప్యూటర్లను అన్ లాక్ చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఇరురాష్ట్రాల అధికారులు ముందుగానే మొత్తం సమాచారాన్ని బ్యాకప్ చేసుకోవడంతో ప్రమాదం తప్పింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ డిస్కంల అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ అధికారులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఏపీ డిస్కం అధికారులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ సైబర్ దాడి అంతర్జాతీయ హ్యాకర్ల పని అయ్యుండొచ్చని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.

More Telugu News