devegowda: ఉడుపిలో దేవెగౌడ, కుమారస్వామికి పంచకర్మ చికిత్సలు

  • ప్రచారంలో అలసిపోయిన తండ్రీకొడుకులు
  • యోగా, ధ్యానంలో నిమగ్నం
  • పార్టీ నేతలకు కూడా దూరం

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మండుటెండల్లో ప్రచారం నిర్వహించిన మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిలు బాగా అలసిపోయారు. ఈ నేపథ్యంలో ఉడుపిలోని సాయిరాధా రిసార్టులో వీరిద్దరూ ఆయుర్వేద చికిత్సలు పొందుతున్నారు. పంచకర్మ చికిత్సలు చేయించుకుంటూ సాంత్వన పొందుతున్నారు. యోగా, ధ్యానంలో నిమగ్నమయ్యారు. మీడియాను అనుమతించవద్దని కుమారస్వామి కోరడంతో... అధికారులు అటువైపు ఎవరినీ అనుమతించడం లేదు. అంతేకాదు, జేడీఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దూరంగా ఉండాలని కోరారు. తాము పూర్తి విశ్రాంతిలో ఉన్నామని, పార్టీ నేతలతో కూడా కొన్ని రోజులు మాట్లాడబోనని కుమారస్వామి చెప్పినట్టు సమాచారం.

More Telugu News