fani: ఫణి ఎఫెక్ట్.. ఒడిశాలో ఎన్నికల కోడ్ ఎత్తివేత

  • 11 తీర ప్రాంత జిల్లాల్లో కోడ్ ఎత్తివేత
  • సహాయక చర్యలకు ఇబ్బంది ఉండకూడదనే ఈ నిర్ణయం
  • నాలుగో విడతలో ఒడిశాలో ముగిసిన పోలింగ్

ఫణి తుపాను నేపథ్యంలో ఒడిశాలోని 11 తీర ప్రాంత జిల్లాల్లో ఎన్నికల కోడ్ ను ఎత్తివేశారు. తుపాను తీవ్రంగా ఉండబోతోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీ సమీక్షించి చేసిన సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘంతో నిన్న భేటీ అయిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తుపాను ప్రభావంపై చర్చించారు. ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో, ఎన్నికల కోడ్ ను ఎత్తివేయాలని కోరారు. సహాయక చర్యలకు కోడ్ అడ్డుపడకూడదనే ఈ మేరకు విన్నవించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. నాలుగో విడతలో ఒడిశాలో పోలింగ్ ముగిసింది.

More Telugu News