'ఫణి' భయపెడుతోంది... ఉప ఎన్నిక వాయిదా కోరిన ఒడిశా సీఎం!
- మూడు రాష్ట్రాలను భయపెడుతున్న 'ఫణి'
- పట్కురా ఉప ఎన్నికను వాయిదా వేయండి
- సునీల్ అరోరాను కోరిన నవీన్ పట్నాయక్
వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం ఒడిశాలోని కాలాహండి, సంబల్ పూర్, డియోగ్రాఫ్, సుందర్ గఢ్ తదితర ప్రాంతాల్లో కుంభవృష్టి కురవనుంది. మే 1 నుంచి కనీసం మూడు, నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. మే 3న దక్షిణ పూరీ ప్రాంతంలో 175 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని, 4వ తేదీ నాటికి తుపాను ప్రభావం కొంతమేరకు తగ్గుతుందని తెలిపింది. కాగా, ఒడిశా, ఆంధ్రా కోస్తా తీరాన్ని గత సంవత్సరం వణికించిన 'తిత్లీ' కన్నా 'ఫణి' తీవ్రత అధికమని అధికారులు అంటున్నారు.