chiranjeevi: ఆగస్టు నుంచి కొరటాలతో సెట్స్ పైకి చిరంజీవి

  • చిరంజీవి తాజా చిత్రంగా 'సైరా'
  • తదుపరి సినిమా కొరటాలతో 
  • ముఖ్య పాత్రల్లో సునీల్ .. అనసూయ     

ప్రస్తుతం చిరంజీవి 'సైరా' సినిమా షూటింగుతో బిజీగా వున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి తదుపరి సినిమాపై కూడా అభిమానులు దృష్టి పెట్టారు. చిరంజీవి నెక్స్ట్ మూవీ కొరటాలతో వున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసిన కొరటాల ఈ సినిమాను ఆగస్టులో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.

పెద్ద గ్యాప్ లేకుండా రెగ్యులర్ షూటింగును మొదలుపెడతారని అంటున్నారు. వినోదంతో పాటు సందేశంతో కూడిన కథగా ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. కథానాయికలుగా తమన్నా .. శ్రుతిహాసన్ పేర్లు వినిపిస్తున్నాయిగానీ, ఇంకా క్లారిటీ రాలేదు. సునీల్ .. అనసూయ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారనే టాక్ మాత్రం వినిపిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

More Telugu News