uma bharati: ఉమాభారతిని ఆలింగనం చేసుకుని భోరున విలపించిన సాధ్వి ప్రజ్ఞాసింగ్

  • ఉమాభారతి నివాసానికి వెళ్లిన ప్రజ్ఞా సింగ్
  • సాగనంపేందుకు కారు వద్దకు వచ్చిన ఉమాభారతి
  • తీవ్ర భావోద్వేగానికి గురైన సాధ్వి

కేంద్ర మంత్రి ఉమాభారతిని ఆలింగనం చేసుకుని బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ భోరున విలపించారు. వివరాల్లోకి వెళ్తే, భోపాల్ లోని ఉమాభారతి నివాసానికి ఈరోజు ప్రజ్ఞా సింగ్ వెళ్లారు. సమావేశం ముగిసిన తర్వాత ఆమెను సాగనంపేందుకు ఉమాభారతి కూడా కారు వద్దకు వచ్చారు. ఆమెను కారు ఎక్కించి, సీటులో దిండు వేసి, కూర్చోబెట్టారు. సాధ్వి కాళ్లు మొక్కి నమస్కరించారు.

ఈ సందర్భంగా ప్రజ్ఞాసింగ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వెక్కివెక్కి ఏడ్చారు. సాధ్విని చూసి ఉమాభారతి కూడా భావోద్వేగానికి గుర్యారు. ఆమెను హత్తుకుని అలాగే ఉండిపోయారు. ప్రజ్ఞా సింగ్ ను ఓదార్చి అక్కడి నుంచి పంపించారు.

అనంతరం మీడియాతో ఉమాభారతి మాట్లాడుతూ, ప్రజ్ఞాసింగ్ గొప్ప సన్యాసిని అని అన్నారు. ఆమెతో తనను పోల్చవద్దని, తాను సాధారణమైన వ్యక్తినని చెప్పారు. కాగా, భోపాల్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై ప్రజ్ఞాసింగ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News