Andhra Pradesh: గుంటూరులో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఒకరి దుర్మరణం, మరొకరికి తీవ్రగాయాలు!

  • వేగంగా వెళుతూ అదుపుతప్పిన బస్సు
  • గుంటూరు నుంచి నరసరావుపేటకు వెళుతుండగా ఘటన
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఈరోజు ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతూ అదుపుతప్పిన బస్సు, నాదెండ్ల మండలం సాతులూరు వద్ద ఉన్న షాపుల సముదాయంపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.

వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం స్థానికుల సాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. ఈ బస్సు గుంటూరు నుంచి నరసరావుపేటకు వెళుతోందని చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేశామనీ, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News