Narendra Modi: నమో టీవీ యాంకర్ గా హీరో అక్షయ్ కుమార్ బాగా సరిపోతారు: ఒవైసీ సెటైర్

  • టీవీ యాంకర్లు సరిపోరని ప్రధాని ఓ కొత్త యాంకర్ ను పట్టుకొచ్చారు
  • అక్షయ్ కుమార్ ప్రధానిని సిల్లీ క్వశ్చన్స్ అడిగారు
  • ఓ ప్రధానిని అడగాల్సిన ప్రశ్నలేనా అవి?

కొన్నిరోజుల కిందట బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఏ పేపర్లో చూసినా అదే పతాక శీర్షికల్లో కనిపించింది. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలిలో వ్యంగ్యం ప్రదర్శించారు. ఉన్న యాంకర్లు సరిపోక ప్రధాని మరో కొత్త యాంకర్ ను పట్టుకొచ్చారంటూ సెటైర్ విసిరారు. టీవీ యాంకర్లు తన అంచనాలు అందుకోలేరని హీరో అక్షయ్ కుమార్ ను యాంకర్ గా తీసుకువచ్చారంటూ ఎద్దేవా చేశారు.

"ఆ కొత్త యాంకర్ అయినా సరిగా చేశాడా అంటే అదీ లేదు. మామిడి పండు మొత్తం తింటారా లేక ముక్కలు కోసుకుని తింటారా? అంటూ సిల్లీ క్వశ్చన్స్ అడిగారు. ఓ ప్రధానిని అడగాల్సిన ప్రశ్నలేనా అవి? అందుకే, నమో టీవీ యాంకర్ గా అక్షయ్ కుమార్ సరిగ్గా సరిపోతారని అనిపిస్తోంది" అంటూ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News