New currency: కొత్త రూ.20 నోటును విడుదల చేయనున్న ఆర్బీఐ

  • మహాత్మా గాంధీ సిరీస్ లో నోటు
  • నోటుపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం
  • ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగుల మిశ్రమంగా కొత్త నోటు

కొత్త ఇరవై రూపాయల నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేయనుంది. మహాత్మా గాంధీ సిరీస్ లో ఈ నోటు ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో ఈ నోటు వెలువడనున్నట్టు తెలిపింది. ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగుల మిశ్రమంగా ఈ కొత్త నోటు ఉన్నట్టు సమాచారం. కొత్త రూ.20 నోటుతో పాటు పాత నోట్లు కూడా చెల్లుతాయని, దీనిపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

More Telugu News