devineni uma: రిపబ్లిక్ డే నాటికి విజయసాయిరెడ్డి జైల్లో ఉంటారు: దేవినేని ఉమ

  • మే 23న వైసీపీ దుకాణం బంద్ అవుతుంది
  • బీజేపీలో వైసీపీని కలిపేందుకు చర్చలు జరుగుతున్నాయి
  • జగన్, విజయసాయిరెడ్డి జనాల్లో ఉండాల్సినవారు కాదు

మే 23వ తేదీ తర్వాత వైసీపీ దుకాణం బంద్ అవుతుందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బీజేపీలో వైసీపీని విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి బీజేపీ అగ్రనేతలతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చర్చలు జరుపుతున్నారని తెలిపారు. వచ్చే రిపబ్లిక్ డే నాటికి విజయసాయిరెడ్డి జైల్లో ఉంటారని చెప్పారు. అయితే తీహార్ జైల్లో ఉండాలా? లేక రాజమండ్రి జైల్లో ఉండాలా? అనే విషయాన్ని ఆయనే తేల్చుకోవాలని అన్నారు. వైసీపీ అధినేత జగన్, విజయసాయిరెడ్డి జనాల మధ్య ఉండాల్సిన వ్యక్తులు కాదని చెప్పారు. విజయవాడలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.


  • Loading...

More Telugu News