Uttar Pradesh: వారణాసి చేరుకున్న నిజామాబాద్ రైతులు

  • పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై నిరసన
  • వారణాసిలో నామినేషన్లు వేయనున్న రైతులు
  • ఈ సమస్యను మోదీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం

తెలంగాణలోని నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయనందుకు కేంద్రంపై రైతులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్లు వేసేందుకు ఈ జిల్లా రైతులు అక్కడికి చేరుకున్నారు.  కాగా, తెలంగాణలో మొదటి విడతలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ రైతులు తమ నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, వారణాసి లోక్ సభ స్థానం నుంచి రైతులు నామినేషన్లు సమర్పించడం ద్వారా ఈ సమస్యను మోదీ దృష్టికి తీసుకురానున్నారు.

  • Loading...

More Telugu News