Prakash Raj: ఒకరు సుపుత్రుడు, మరొకరు కుపుత్రుడు... కన్నయ్య కుమార్ కోసం ప్రకాశ్ రాజ్ ప్రచారం

  • కన్నయ్య కోసం బెగుసరాయి రావడం ఆనందంగా ఉంది
  • కన్నయ్య రాకతో 'కాపలాదారులు' ఆందోళన చెందుతున్నారు
  • మోదీపై పరోక్ష విమర్శలు

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన బీజేపీ వ్యతిరేకవాదులు ఎక్కడున్నా గానీ వాళ్లందరితోనూ సఖ్యతగా మెలుగుతూ వాళ్ల కోసం ప్రచారానికి సైతం వెళుతున్నారు. తాజాగా, విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ బీహార్ లోని బెగుసరాయి నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థిగా పోటీచేస్తుండగా, ప్రకాశ్ రాజ్ తన మద్దతు ప్రకటించారు. అంతేకాదు, బెగుసరాయి వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, కన్నయ్య కుమార్ కోసం ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కన్నయ్య కుమార్ వయసులో తనకంటే చిన్నవాడైనా ఆలోచనల్లో ఎంతో పెద్దవాడని ప్రశంసించారు. ఎన్నికల్లో పోటీ ఇద్దరి మధ్యే ఉందని, ఒకరు సుపుత్రుడు (కన్నయ్య కుమార్), మరొకరు కుపుత్రుడు అంటూ మోదీపై సెటైర్ వేశారు. కన్నయ్య కుమార్ బెగుసరాయి నుంచి పోటీచేస్తున్నా గానీ అతడు యావత్ భారతదేశపు గొంతుక అని అభివర్ణించారు. కన్నయ్య బరిలో దిగడంతో చౌకీదార్లు (కాపలాదారులు) ఆందోళనకు గురవుతున్నారంటూ ప్రకాశ్ రాజ్ ఎద్దేవా చేశారు.

More Telugu News