Narendra Modi: చౌకీదార్‌నంటూ మోదీ ఆడుతున్న నాటకాలు ఇక చెల్లవు: మాయావతి

  • ఈ ఎన్నికలతో నమో నామస్మరణ ముగుస్తుంది
  • అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చింది
  • బీజేపీ అన్ని వర్గాలనూ మోసం చేసిందన్న మాయావతి 

ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ పార్టీపై బహుజన్‌సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి నిప్పులు చెరిగారు. నేడు యూపీలోని కన్నౌజ్‌లో ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి ఆమె ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ, ఈ ఎన్నికలతో నమో నామస్మరణ ముగుస్తుందన్నారు. తాను చౌకీదార్‌నంటూ మోదీ ఆడుతున్న నాటకాలు చెల్లవన్నారు.

గత ఎన్నికల్లో అబద్ధపు హామీలనిచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చిందని మాయావతి దుయ్యబట్టారు. ఈ ఐదేళ్లలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ విషయమై మాయావతి మాట్లాడుతూ, కుల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ అధినేత అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్‌ను, ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.

  • Loading...

More Telugu News