Inter: సచివాలయం ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం.. తోపులాట

  • దాదాపు 50 మంది అరెస్ట్
  • జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలి
  • గ్లోబరినా సంస్థపై చర్యలు తీసుకోవాలి

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో నేడు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడికి యత్నించాయి. దీంతో సచివాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థి సంఘాలకు మధ్య తోపులాట జరిగింది.

ఈ సందర్బంగా దాదాపు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయడమే కాకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన అధికారులపైనా, గ్లోబరీనా సంస్థపైనా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

More Telugu News