Telangana: ప్రగతిభవన్ ను ముట్టడించిన జనసేన కార్యకర్తలు!

  • ఇంటర్ ఫలితాలకు నిరసనగానే
  • అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు
  • గోషామహల్ స్టేడియానికి తరలింపు

తెలంగాణ ఇంటర్ బోర్డు అవకతవకల వ్యవహారంపై విద్యార్థి లోకం భగ్గు మంటోంది. ఈ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు ఈరోజు సీఎం కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు.

ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని ఈ సందర్భంగా జనసేన నేతలు డిమాండ్ చేశారు. అలాగే మిగిలిన విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా జనసేన శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీసులు, గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకోవడంతో 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News