శ్రీలంక పేలుళ్ల ఘటనలో వెలుగులోకి విస్తుపోయే నిజాలు
- పేలుళ్లకు పాల్పడిన దుండగుల్లో ప్రముఖ వ్యాపారి కుమారులు
- వ్యాపారి, వారి మూడో కుమారుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
- సిన్నమన్ గ్రాండ్, షాంగ్రీలా హోటళ్లలో దాడులు జరిపింది వారే
అన్నదమ్ములైన ఇమ్సాత్, ఇల్హాం ఇద్దరూ బ్యాగుల్లో బాంబులు నింపుకుని కొలంబోలోని సిన్నమన్ గ్రాండ్, షాంగ్రీ లా హోటళ్లలో దాడులకు పాల్పడినట్టు సమాచారం. వీరి పేర్లు బయటకు రాగానే యూసుఫ్ సహా ఆయన మూడో కుమారుడైన ఇజాస్ అహ్మద్ ఇబ్రహీం (30)ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాంబు పేలుళ్లు తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే యూసుఫ్ కుమారులకు సంబంధం ఉందనే విషయం బయటపడి సంచలనమైంది.