Rambabu: యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం చేస్తున్న వ్యక్తికి దేహశుద్ధి.. పోలీసులకు అప్పగింత

  • యువతిని తెలిసిన వారింటికి తీసుకెళ్లిన రాంబాబు
  • మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్‌‌ను తాగించి అత్యాచారం
  • సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి తరచూ వేధింపులు

యువతికి కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారం చేసి దానిని సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి, ఆ వీడియోను చూపిస్తూ తరచూ అత్యాచారానికి పాల్పడుతున్న వ్యక్తికి యువతి బంధువులు దేహశుద్ధి చేసి, ఆపై పోలీసులకు అప్పగించారు. ఆ వివరాల్లోకి వెళితే, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం, ఎల్బీ చర్ల ప్రభుత్వాసుపత్రిలో రాంబాబు అనే వ్యక్తి సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు.

కొద్ది రోజుల క్రితం ఓ యువతిని తనకు తెలిసిన వారింటికి తీసుకెళ్లి అక్కడ కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆ యువతి మత్తులోకి జారుకోగానే ఆమెపై అత్యాచారం జరిపి దానిని సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఆ వీడియోను తరచూ చూపిస్తూ ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. రాంబాబు వేధింపులు ఎక్కువ కావడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే సమయంలో విషయం తెలుసుకున్న యువతి బంధువులు రాంబాబును చితకబాది పోలీసులకు అప్పగించారు.

More Telugu News