Viszg: ఏపీజీవీ బ్యాంకును పేల్చేస్తానంటూ మహిళ బెదిరింపు

  • అనకాపల్లిలోని బ్యాంకు మేనేజర్ కు బెదిరింపు మెస్సేజ్
  • ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు
  • ఆమె ఐకేపీకి చెందిన మహిళగా గుర్తింపు

విశాఖపట్టణం జిల్లాలోని అనకాపల్లిలో ఏపీజీవీ బ్యాంకును బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపు సందేశం వచ్చింది. ఈ సందర్భంగా పోలీసులకు బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఓ మెస్సేజ్ వచ్చిందని పోలీసులకు చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ బెదిరింపులకు పాల్పడింది ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) కేంద్రానికి చెందిన ఓ మహిళగా గుర్తించారు. ఆ మహిళను అనకాపల్లి పోలీసులు అరెస్టు చేశారు. కాగా, బ్యాంకును పేల్చేస్తానంటూ ఈ మహిళ ఎందుకు బెదిరించిందో తెలియాల్సి ఉంది.

More Telugu News