sanjay dutt: భారీ నష్టాల దిశగా కరణ్ జొహార్ 'కళంక్'

  • భారీ తారాగణంతో తెరకెక్కిన 'కళంక్'
  • వారంరోజుల్లో 75 కోట్లు దాటని వసూళ్లు 
  • 50 కోట్లకి పైనే నష్టాలు అంటూ టాక్  

కరణ్ జొహార్ నిర్మాతగా అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో 'కళంక్' సినిమా నిర్మితమైంది. సంజయ్ దత్ .. మాధురీ దీక్షిత్ .. వరుణ్ ధావన్ .. అలియా భట్ .. సోనాక్షి సిన్హా .. ఆదిత్య రాయ్ కపూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీన భారీస్థాయిలో థియేటర్లకు వచ్చింది. ప్రధానమైన పాత్రల్లో కనిపించే నాయకా నాయికలంతా విపరీతమైన క్రేజ్ కలిగిన వాళ్లే. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. కానీ ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. భారీ తారాగణం ఈ సినిమాను ఎంత మాత్రం కాపాడలేకపోయింది. కరణ్ జొహార్ తండ్రి యష్ జొహార్ డ్రీమ్ ప్రాజెక్టు ఇది. కొన్ని కారణాల వలన ఆయన ఈ కథను తెరపైకి తీసుకురాలేకపోయారు. తండ్రి కోరికను నెరవేర్చాలనుకున్న కరణ్ జొహార్ కి భారీ నష్టాలు తప్పడం లేదని చెప్పుకుంటున్నారు. 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. వారం రోజుల్లో ఈ సినిమా 75 కోట్ల మార్కును కూడా దాటలేకపోయింది. దాంతో 50 కోట్లకి పైగా నష్టాలు రావొచ్చనే అభిప్రాయాలు బాలీవుడ్లో వినిపిస్తున్నాయి.

More Telugu News