Andhra Pradesh: ఏపీలో ఒకేరోజున రెండు పరీక్షలు.. ఏది రాయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్న నిరుద్యోగులు!

  • వచ్చే నెల 5న గ్రూప్-2 పరీక్షల నిర్వహణ
  • అదే రోజున ఎల్ఐసీ ఏఏవో పరీక్షలు కూడా
  • వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు విచిత్రమైన పరిస్థితి ఎదురయింది. ప్రస్తుతం వచ్చే నెల 5న గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష జరగనుండగా అదే రోజున ఎల్ఐసీ ఏఏఓ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-2 పరీక్షకు ఇప్పటికే 3 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చాలామంది ఏఏవో పరీక్షకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏ పరీక్షకు హాజరుకావాలో అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.

అయితే గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా తాము పలుమార్లు కోరినా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) పట్టించుకోలేదని కొందరు నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు జరిగినప్పుడు రాష్ట్ర స్థాయి పరీక్షలను వాయిదా వేసేవారని , కానీ ఏపీపీఎస్సీ ఆ సంప్రదాయాన్ని ప్రస్తుతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News