rajani: 'దర్బార్' షూటింగులో జాయినైన నయనతార

  • సెట్స్ పై రజనీ 167వ సినిమా 
  • మురుగదాస్ దర్శకత్వంలో తొలిసారి 
  • చాలా కాలం తరువాత రజనీ జోడీగా నయన్

రజనీకాంత్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' చిత్రం రూపొందుతోంది. రజనీ 167వ సినిమాగా ఇటీవలే ఇది సెట్స్ పైకి వెళ్లింది. రజనీకాంత్ తదితరులపై కొన్ని రోజుల పాటు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగులో ఈ రోజున నయనతార జాయిన్ అయిందనేది తాజా సమాచారం. రజనీ .. నయన్ కాంబినేషన్లోని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.

అభిమానులు రజనీ సరసన నయనతారను చూసి చాలాకాలమే అయింది. అందువలన ఈ కాంబినేషన్ పై వాళ్లంతా ఎంతో ఆసక్తిగా వున్నారు. ఈ సినిమాలో రజనీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని అంటున్నారు. సామాజిక సేవకుడిగా ఆయన మరో పాత్రలోను కనిపించనున్నాడనే టాక్ వుంది. అయితే ఈ విషయంలో క్లారిటీ రావలసి వుంది. రజనీ .. మురుగదాస్ కాంబినేషన్లో తొలిసారిగా రూపొందుతోన్న ఈ సినిమా, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More Telugu News