nikhil: 'అర్జున్ సురవరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా తెరపైకి చిరంజీవి పేరు

  • నిఖిల్ నుంచి 'అర్జున్ సురవరం'
  • కథానాయికగా లావణ్య త్రిపాఠి
  •  మే 1వ తేదీన భారీ విడుదల

 నిఖిల్ కథానాయకుడిగా సంతోష్ దర్శకత్వంలో 'అర్జున్ సురవరం' నిర్మితమైంది. నిఖిల్ జర్నలిస్ట్ గా నటించిన ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా లావణ్య త్రిపాఠి కనిపించనుంది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాను, మే 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ లోగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి నిర్మాత ఠాగూర్ మధు సన్నాహాలు చేస్తున్నాడు.

ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చిరంజీవిని ఆహ్వానించే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు. చిరంజీవికి .. 'ఠాగూర్' మధుకి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన ఆయన ఆహ్వానిస్తే చిరంజీవి తప్పనిసరిగా వస్తారని చెప్పుకుంటున్నారు. కనుక ఈ వేడుకకి ముఖ్య అతిథి చిరంజీవి అని చెప్పుకోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో నిఖిల్ వున్నాడు.

More Telugu News