anchor: మందు కొట్టి రచ్చ చేసిన యాంకర్ ప్రశాంతి.. కేసు నమోదు

  • ఉప్పల్ స్టేడియంలో ప్రశాంతి హల్ చల్
  • తప్పతాగి ఇబ్బందికరంగా ప్రవర్తించిన వైనం
  • కాసేపట్లో పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్న ప్రశాంతి

ఉప్పల్ స్టేడియంలో నిన్న జరిగిన హైదరాబాద్-కోల్ కతా మ్యాచ్ సందర్భంగా టీవీ యాంకర్ ప్రశాంతి రచ్చరచ్చ చేసింది. తన స్నేహితులు ప్రియ, పూర్ణిమ, శ్రీకాంత్ రెడ్డి, సురేశ్, వేణుగోపాల్ లతో కలసి మ్యాచ్ చూసేందుకు ఆమె వచ్చింది. ఈ సందర్భంగా తోటి ప్రేక్షకులకు ఇబ్బంది కలిగేలా వారు ప్రవర్తించారు. సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో ప్రశాంతి అసభ్యకరంగా ప్రవర్తించింది. వీరి చేష్టలతో అసహనానికి లోనైన ఓ వీక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ టీవీ ఫూటేజిని పరిశీలించిన పోలీసులు ప్రశాంతిపై కేసు నమోదు చేశారు. కాసేపట్లో ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి వివరణ ఇవ్వనున్నట్టు సమాచారం.

More Telugu News