శ్రీలంకలో చిక్కుకుపోయిన అనంతపురం వాసులు!
- ఎస్ ఆర్ కన్ స్ట్రక్షన్స్ అధినేత సురేంద్రబాబుకు గాయం
- మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సురేంద్రబాబు
- హోటల్ గదిలోనే ఉండిపోయిన పాస్ పోర్టులు, ఇతర పత్రాలు
అయితే, ఈ హోటల్ కు సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడు జరిగిన సమయంలో వారు ఆ హోటల్ లో అల్పాహారం తీసుకుంటున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పర్యాటకులు ఆందోళన చెందవద్దంటూ హోటల్ సిబ్బంది మైక్ ద్వారా ఓ ప్రకటన చేసింది. అయినప్పటికీ, పర్యాటకులు హోటల్ నుంచి బయటపడేందుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో అమిలినేని సురేంద్రబాబుకు స్వల్ప గాయమైంది. సురేంద్రబాబు సహా ఆయన స్నేహితుల పాస్ పోర్టులు, ఇతర పత్రాలు హోటల్ గదిలోనే ఉండిపోయినట్టు సమాచారం.