Sri Lanka: ఉగ్రవాదుల చర్య అత్యంత హేయమైంది: సీఎం కేసీఆర్

  • ఈ దాడులను ఖండిస్తున్నాం
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి 
  • గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలి

శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ దాడులను ఖండిస్తున్నామని అన్నారు. ఉగ్రవాదుల చర్య అత్యంత హేయమైందిగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. కాగా, కొలంబోలో 8 చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లలో 250 మందికిపైగా మృతి చెందగా, మూడు వందల మందికి పైగా గాయపడ్డారు. పేలుళ్ల మృతుల్లో 35 మంది విదేశీయులు ఉన్నారు.

More Telugu News