తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ... దర్శనానికి 26 గంటల సమయం!
- భక్తులతో నిండిన 31 కంపార్టుమెంట్లు
- సర్వ దర్శనానికి 26 గంటల సమయం
- మిగతా భక్తులకు మూడు నుంచి ఆరు గంటల సమయం
శ్రీవారి దర్శనార్థం వేచివున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారని టీటీడీ ప్రకటించింది. స్వామి వారి సర్వదర్శనానికి 26 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్ తీసుకున్నవారికి, నడక దారి భక్తులకు, రూ. 300 ప్రత్యేక దర్శనానికి మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతోందని పేర్కొన్నారు. క్యూలైన్లలోని భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా అన్న పానీయాలను సమకూరుస్తున్నామన్నారు.