Cricket: ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా తప్పతాగిన క్రికెట్ సంఘం సభ్యులు

  • చెన్నై-హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా ఘటన
  • స్టేడియం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో మందుపార్టీ
  • తెలంగాణ క్రికెట్ సంఘం తీవ్ర ఆగ్రహం

చాలాకాలంగా వివాదాలకు మారుపేరుగా నిలుస్తున్న హైదరాబాద్ క్రికెట్ సంఘం మరోమారు వార్తల్లోకెక్కింది. ఐపీఎల్ లో చెన్నై-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం సభ్యులు తప్పతాగిన ఘటన తెరపైకి వచ్చింది. స్టేడియంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో క్రికెట్ సంఘం కార్యవర్గ సభ్యులు మందు పార్టీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో ఖాళీ మందు బాటిల్స్ దర్శనమిచ్చాయి. ఈ ఘటనపై తెలంగాణ క్రికెట్ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది.

More Telugu News