Murali Mohan: సినీ నటుడు మురళీమోహన్ కు మాతృవియోగం

  • కన్నుమూసిన మాగంటి వసుమతి దేవి
  • చికిత్స పొందుతూ మృతి
  • శుక్రవారం అంత్యక్రియలు!

సినీ నటుడు, ప్రముఖ వ్యాపారవేత్త, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కు మాతృవియోగం కలిగింది. మురళీమోహన్ తల్లి మాగంటి వసుమతి దేవి అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆమె వయసు 100 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న వసుమతి దేవిని విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఆమె భౌతికకాయాన్ని రాజమండ్రిలోని మురళీమోహన్ నివాసానికి ఈ సాయంత్రం తీసుకురానున్నారు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం జరిగే అవకాశాలున్నాయి. మురళీమోహన్ కు మాతృవియోగం కలిగిందని తెలిసి అన్ని రంగాల ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

More Telugu News