Maharashtra: మహారాష్ట్రలోని నాందేడ్‌, సోలాపూర్‌ ప్రాంతాల్లో మొరాయించిన ఈవీఎంలు

  • ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌
  • పోలింగ్‌ శాతం తగ్గుతుందేమోనని ఆందోళన
  • ఆంధ్రాలో ఈనెల 11న ఇదే పరిస్థితి

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్‌ జరుగుతున్న మహారాష్ట్రలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంపై కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. నాందేడ్‌, సోలాపూర్‌ తదితర ప్రాంతాల్లో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనివల్ల పోలింగ్‌ శాతం తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈనెల 11వ తేదీన ఏపీలో జరిగిన పోలింగ్‌ సందర్భంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎన్నికల సంఘానికి తలబొప్పికట్టిపోయింది.

More Telugu News