ND Tiwari: ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ శేఖర్ మృతి!

షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దివంగత ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ (39) మృతి చెందారు. ఢిల్లీలోని మ్యాక్స్ సాకేత్ ఆసుపత్రికి అంబులెన్స్ లో అతనిని తీసుకువెళ్లినట్టు, అయితే అప్పటికే రోహిత్ మృతి చెందినట్టు వైద్యులు చెప్పారని ఢిల్లీ జాయింట్ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఏ కారణంగా ఆయన మరణించిందీ ఇంకా తెలియరాలేదు. మరోపక్క, రోహిత్ శేఖర్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా, ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో రోహిత్ శేఖర్ వుంటున్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో అతని తల్లి ఇంట్లో లేనట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఎన్డీ తివారీ తన తండ్రే అంటూ ఆరేళ్ల పాటు న్యాయస్థానంలో పోరాడి రోహిత్ శేఖర్ గెలిచాడు. దీంతో, అతను తన కొడుకేనని తివారీ కూడా అంగీకరించాల్సి వచ్చింది.  
Go Back to Shorts
ND Tiwari
congress
Rohit sheker
demise

More Telugu News