Badminton: ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చూశాడు, అదీ జగన్ చరిత్ర!: లంకా దినకర్

  • క్రీడాభివృద్ధికి పుల్లెలకు చంద్రబాబు స్థలమిచ్చారు
  • ఆ స్థలాన్ని కబ్జా చేయాలని జగన్ చూశాడు
  • కబ్జా కాకుండా పుల్లెల పోరాడి నిలుపుకున్నాడు

 టీడీపీ నేత లంకా దినకర్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు. సింధు గురువు పుల్లెల గోపీచంద్ కు బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధి నిమిత్తం నాడు చంద్రబాబు హయాంలో స్థలం ఇచ్చామని, ఆ స్థలాన్ని జగన్ తో సహా వైఎస్ కుటుంబం కబ్జా చేయాలనుకుందని దినకర్ ఆరోపించారు. ఆ స్థలం కబ్జాకు గురికాకుండా పుల్లెల గోపీచంద్ పోరాడి నిలుపుకున్నారని అన్నారు. అదీ జగన్ చరిత్ర అని, జగన్ ఏ ఉదాహరణ చెప్పినా దాని వెనుక ఆయన, ఆయన కుటుంబసభ్యుల హస్తం ఉంటుందని ఆరోపించారు. ఈవీఎంలను ఉంచే స్ట్రాంగ్ రూమ్స్ ని ఇడుపులపాయలో జగన్ నివాసంలో ఉండే స్టోర్ రూమ్ అనుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News