టీడీపీ ఓడిపోవడం జరగదు, ఒకవేళ ఓడిపోతే ఫోరెన్సిక్ ఆడిట్ అడుగుతాం: హరిప్రసాద్
- ఎన్నికల ప్రచారంలో తాను కూడా పాల్గొన్నా
- కొద్దో గొప్పో ఓటర్ల నాడి తెలుసుకున్నా
- ఈసీ వన్ సైడెడ్ గా వ్యవహరించింది
‘ఈ మిషన్లు మనకు వద్దు. బ్యాలెట్ పేపర్లు తెచ్చుకుందాం’ అని హరిప్రసాద్ పిలుపు నిచ్చారు. ఓటర్ వెరిఫికేషన్ కు సాంకేతికత వాడుకోవాలని, ఓటు వెరిఫికేషన్ ఓటర్ నే చేసుకోనివ్వాలని అభిప్రాయపడ్డారు. ఓటర్ అసలైన ఓటరా? కాదా? అని గుర్తించేందుకు వారి ఆధార్ కార్డును చూడాలని లేదా బయోమెట్రిక్ విధానం అనుసరించాలని సూచించారు. ఆ తర్వాత బ్యాలెట్ పేపర్ ఓటర్ చేతికిస్తే ఓటేసే వెళతారని అన్నారు. అన్ని పోలింగ్ బూత్ ల్లో కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, స్క్రీనింగ్ ఏర్పాటు చేసుకోవాలని, టెక్నాలజీని వినియోగించుకుని అక్రమాలకు పాల్పడేందుకు ఎవరైనా వస్తే వారిని గుర్తించి చర్యలు తీసుకోవచ్చని సూచించారు.