mammootty: మమ్ముట్టి 'మధుర రాజా' వసూళ్ల వివాదం

  • మమ్ముట్టి హీరోగా 'మధుర రాజా'
  • మాఫియా నేపథ్యంలో సాగే కథ
  •  కీలకపాత్రలో జగపతిబాబు

మమ్ముట్టి కథానాయకుడిగా రూపొందిన 'మధుర రాజా' ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో, జగపతిబాబు .. జై .. అనుశ్రీ .. మహిమా నంబియార్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తొలిరోజు నుంచే ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోందని నిర్మాతలు చెబుతూ వస్తున్నారు. కేరళ బాక్సాఫీస్ దగ్గర తొలిరోజున ఈ సినిమా 4.2 కోట్లను వసూలు చేసిందనీ, 3 రోజులు పూర్తయ్యేనాటికి 11 కోట్లు రాబట్టిందని పేర్కొన్నారు.

దాంతో తొలివారంలో ఈ సినిమా మోహన్ లాల్ 'పులిమురుగన్' వసూళ్లను అధిగమిస్తుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కొంతమంది నిర్మాతలు ఈ సినిమా వసూళ్ల పట్ల సందేహాలను .. అనుమానాలను వ్యక్తం చేశారు. తొలిరోజున ఈ సినిమా సాధించిన వసూళ్లు కేవలం 2.97 కోట్లు మాత్రమేనంటూ తేల్చిచెప్పడంతో నిర్మాతల మధ్య వివాదం మొదలైంది. మరో వైపున .. రికార్డుల కోసం ఇలా దిగజారతారా? అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైంది. 

More Telugu News