Andhra Pradesh: ఆంధ్రా ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేశారు?.. ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు!

  • గత రెండ్రోజులుగా ఫోన్ల మీద ఫోన్లు
  • 8667124557 నంబర్  ద్వారా కాల్స్
  • ఎవరు చేపట్టారన్న దానిపై రాని స్పష్టత

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు ముగిసినప్పటికీ సర్వేలు కొనసాగుతున్నాయా? ఏ పార్టీకి ఓటేశారో చెప్పమని ఓటర్లకు ఫోన్లు వస్తున్నాయా? అంటే ప్రజలు అవుననే జవాబు ఇస్తున్నారు. ఎన్నికలు ముగిసిన రెండ్రోజుల తర్వాత ఏపీలోని పలువురికి 8667124557 నంబర్ నుంచి ఫోన్లు వస్తున్నాయి.

ఏ పార్టీకి ఓటేశారో చెప్పాలని ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా కోరుతున్నారు. టీడీపీకి ఓటేస్తే 1, వైసీపీకి ఓటేస్తే 2, జనసేనకు ఓటేస్తే 3, కాంగ్రెస్ కు ఓటేస్తే 4, ఇతరులకు ఓటేస్తే 5 నొక్కాలని సూచనలు చేస్తున్నారు. కాగా, ఈ  ఐవీఆర్ఎస్ సర్వేను ఎవరు చేపట్టారన్న  విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

More Telugu News