Andhra Pradesh: ఈసీకీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సహకరించట్లేదు: సీఈసీకి విజయసాయిరెడ్డి లేఖ

  • ఈవీఎంల వద్ద, స్ట్రాంగ్  రూమ్ ల వద్ద సెక్యూరిటీ పెంచాలి
  • నిరంతరం పని చేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
  • కేంద్ర పోలీసులనే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఉంచాలి

ఏపీలో ఈవీఎంల వద్ద, స్ట్రాంగ్  రూమ్ ల వద్ద సెక్యూరిటీ పెంచాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాశారు. అన్ని స్ట్రాంగ్ రూమ్ ల వద్ద 24 గంటలూ పని చేసే సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భద్రత నిమిత్తం అదనంగా కేంద్ర బలగాలను పంపాలని ఆ లేఖలో కోరారు. ఈసీకి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సహకరించడం లేదని, రాష్ట్ర పోలీసులకు బదులు కేంద్ర పోలీసులనే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఉంచాలని కోరారు.

More Telugu News