Andhra Pradesh: గతంలో కన్నా టీడీపీకి పది సీట్లు పెరుగుతాయి: సబ్బం హరి

  • ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవడం చారిత్రక అవసరం
  • టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు
  • గత ఎన్నికల్లో కంటే వైసీపీకి 20 సీట్లు తగ్గుతాయి

గత ఎన్నికల్లో కన్నా ఈ ఎన్నికల్లో టీడీపీకి పది సీట్లు పెరిగే అవకాశం ఉందని ఆ పార్టీ నేత సబ్బం హరి ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీకి వందకు పైగా సీట్లు లభిస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీకి దక్కే స్థానాల గురించి ప్రస్తావిస్తూ, గతంలో కంటే 20 సీట్లు వైసీపీకి తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవడం చారిత్రక అవసరమని ప్రజలు భావించారని, అందుకే, తమ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని వ్యాఖ్యానించారు.

More Telugu News