Chandrababu: రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న చంద్రబాబు

  • ఎన్నికల నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి
  • కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్న బాబు
  • 12 గంటలకు సునీల్ అరోరాతో భేటీ 

సీఎం చంద్రబాబు నిన్న ఏపీలో జరిగిన ఎన్నికల నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఏపీలో జరిగిన ఎన్నికల తీరును వివరించనున్నారు.

రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీ వెళ్లి, మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా, ఇతర కమిషనర్లను కలవనున్నారు. ఎపీ ఎన్నికల నిర్వహణ వైఫల్యాలతో పాటు వీవీ ప్యాట్‌ల లెక్కింపు సంఖ్యను సైతం పెంచాలని చంద్రబాబు కోరనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News