అరవై శాతం ఓట్లు నాకే పడ్డాయి కానీ, వైసీపీ గెలిచే అవకాశాలే ఎక్కువ: కేఏ పాల్

  • ఎన్నికల సంఘం ప్రధాని మోదీ చేతుల్లో ఉంది
  • అవినీతిపై పోరాడేందుకు యువత నాతో కలిసి రావాలి
  • నాతో కలిసి వస్తే దీక్ష చేపడతా
నరసాపురం లోక్ సభ పరిధిలో 60 శాతం ఓట్లు తనకే పడ్డాయి కానీ, ఈవీఎంలలో అవినీతి వల్ల వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ అధినేత ఆరోపించారు. నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ప్రధాని మోదీ చేతుల్లో ఉందని ఆరోపించారు. అవినీతిపై పోరాడేందుకు యువత తనతో కలిసి రావాలని, యువత తన వెంట వస్తే దీక్ష చేపడతానని పిలుపు నిచ్చారు.
Go Back to Shorts
YSRCP
jagan
narasapuram
prajashanti
ka pal

More Telugu News