sensex: వారాంతంలో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 160 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 47 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 
  • 3 శాతం పైగా పెరిగిన ఐటీసీ

వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల తొలి షెడ్యూల్ పాజిటివ్ గా ముగియడం మార్కెట్లలో జోష్ నింపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 160 పాయింట్లు లాభపడి 38,767కు పెరిగింది. నిఫ్టీ 47 పాయింట్లు పుంజుకుని 11,643కు చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (3.14%), మారుతి సుజుకీ (2.13%), యాక్సిస్ బ్యాంక్ (1.61%), హీరో మోటో కార్ప్ (1.43%), వేదాంత (1.43%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.12%).

టాప్ లూజర్స్:
భారతీ ఎయిర్ టెల్ (-1.71%), బజాజ్ ఫైనాన్స్ (-1.37%), ఎల్ అండ్ టీ (-1.22%), టాటా మోటార్స్ (-1.08%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.72%).

More Telugu News