సుమలత విషయంలో మరోమారు నోరుజారిన సీఎం కుమారస్వామి
- 16న సుమలత తలకు కట్టుతో కనిపిస్తారు
- తన కార్యకర్తలతోనే రాళ్లతో కొట్టించుకుంటారు
- యువత సైన్యంలో చేరుతున్నది పొట్ట నింపుకోవడం కోసమే
గురువారం మాండ్యా జిల్లాలోనే మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యువత సైన్యంలో చేరుతున్నది దేశభక్తితో కాదని, రెండు పూటలా తిండికోసమేనని పేర్కొన్నారు. కడుపు నింపుకునేందుకు సైన్యంలో చేరుతున్న వారి జీవితాలతో ప్రధాని మోదీ చెలగాటం ఆడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కుమారస్వామి వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది. యువత సైన్యంలో చేరుతున్నది దేశభక్తితోనేనని స్పష్టం చేసింది. ఇక, తాను కట్టుతో కనిపించబోతున్నానంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై నటి సుమలత స్పందించారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే తనపై దాడికి కుట్ర పన్నినట్టు అనుమానంగా ఉందన్నారు. తేదీ, సమయాన్ని కూడా కచ్చితంగా చెప్పడం చూస్తుంటే దాడికి పథక రచన జరిగే ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.