Vijayawada: టీడీపీ నేత జలీల్ ఖాన్ పై వైసీపీ కార్యకర్తల దాడి

  • విజయవాడలోని తారాపేటలో ఘటన
  • ప్రతిదాడికి పాల్పడ్డ జలీల్ ఖాన్ అనుచరులు
  • పోలీసుల అదుపులో దాడులకు పాల్పడ్డ కార్యాకర్తలు

విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కారుపై వైసీపీ కార్యాకర్తలు దాడికి పాల్పడ్డారు. స్థానిక తారాపేటలో ఆయన కారుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ అనుచరులు ప్రతి దాడికి పాల్పడ్డారు. వించిపేటలోని వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని టీడీపీ, వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. దాడులకు పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆయా ఘటనల్లో ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి.

More Telugu News