wife: రాత్రంతా సినిమాలు చూసిందన్న కోపంతో... భార్యను చంపేశాడట!

  • ముంబై అంధేరీలో ఘటన
  • హత్య చేసిన తర్వాత పోలీసులకు లొంగిపోయిన భర్త
  • సహనం కోల్పోయి భార్యను చంపేశానన్న భర్త

రాత్రంతా సినిమాలు చూస్తూనే ఉందనే కోపంతో భార్యను భర్త చంపేసిన ఘటన ముంబైలోని అంధేరీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చేతన్ (32), ఆర్తి (22)లు అంధేరీలో నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. ఆర్తికి సినిమాల పిచ్చి చాలా ఎక్కువ. ఎప్పుడు చూసినా టీవీలోనో, సెల్ ఫోన్ లోనో టీవీలు చూస్తూ ఉంటుంది. ఈ విషయంపై భార్యాభర్తలిద్దరికీ చాలా సార్లు గొడవలు జరిగాయి. గొడవ జరిగినప్పుడల్లా కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్లేది.

రెండు రోజుల క్రితం ఇంటి సరుకుల కోసం భర్తను ఆర్తి డబ్బు అడిగింది. అతను ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నిన్న రాత్రి భర్తను విడిచిపెట్టి, రాత్రంతా యూట్యూబ్ లో సినిమాలు చూపింది. ఆ శబ్దానికి నిద్రపట్టని చేతన్... ఈ తెల్లవారుజామున ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

గత కొన్ని రోజులుగా తన భార్య రాత్రంతా సినిమాలు చూస్తూనే ఉందని... ఆ శబ్దానికి నిద్ర పట్టలేదని పోలీసులతో చేతన్ చెప్పాడు. సహనం కోల్పోయి భార్యను చంపేశానని ఒప్పుకున్నాడు.

More Telugu News